
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి ఖిల్లాఫై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ భువనగిరి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డిలు పాల్గొన్నారు. మంగళవారం
బిఆర్ఎస్ పార్టీ జిల్లా భువనగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భువనగిరి మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగురవేసేందుకు, అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్న పార్టీ శ్రేణులకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.